ఈ మద్య ఆంధ్రప్రదేశ్ లో వరుసగా విషాదలో చోటు చేసుకుంటున్నాయి. కృష్ణానదిలో బోటు మునిగి 20 మంది చనిపోయిన విషయం తెలిసిందే..తాజాగా ఏపీ మంత్రులకు పెద్ద గండం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న ఎయిరిండియా విమానం ఒకటి ప్రమాదంలో చిక్కుక్కుందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి.
విజయవాడ నుంచి విశాఖపట్టణం వచ్చిన విమానం వాతావరణం అనుకూలించక పోవడంతో అరగంటపాటు గాలిలోనే చక్కర్లు కొట్టంతో అందరూ షాక్ తిన్నారు.ఈ ఘటనపై టీడీపీ వర్గు, ప్రభుత్వ అధికారులు తీవ్ర ఆందోళన గురయ్యారు.
ఇందులో మంత్రి కళా వెంకట్రావు, ఎమ్మెల్యే గణబాబు, వాసుపల్లి గణేష్ కుమార్, సీఎం రమేష్, కంభంపాటి రామ్మోహన్ రావు, పలువురు ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది. విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో అరగంటపాటు గాలిలోనే ఎయిర్ ఇండియా విమానం చక్కర్లు కొట్టింది.