గత కొన్ని రోజులు గా హైదరాబాద్ లో నేరసామ్రాజ్యం విస్తరిస్తున్నట్లు కనిపిస్తుంది.  ఇప్పటికే డ్రగ్స్ మాఫియా ఏ రేంజ్ లో విస్తరించిందో తెలిసిపోయింది..ఇక హైటెక్ వ్యభిచారంలో ఎన్నో కేసులు నమోదు అయ్యాయి.  భూ దందాలు, సెటిల్ మెంట్స్, చైన్ స్నాచింగ్ లే కాకుండా ఈ మద్య గన్ కల్చర్ కూడా పెరిగిపోయింది. 

తాజాగా  అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త, ప్రముఖ విద్యావేత్త వల్లభనేని శ్రీనివాసరావు దారుణహత్యకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ నగరంలోని  సనత్ నగర్ బస్టాప్ సమీపంలో ఆయనను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టీఆర్‌ఎస్ నాయకుడి దారుణ హత్య
ఈ సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అలాగే డాగ్ స్క్వాడ్‌ను రప్పించి నిందితుల కోసం గాలిస్తున్నారు. గత కొంత కాలంగా  స్థానిక నాయకులతో శ్రీనివాసరావుకు విభేదాలు నడుస్తున్నట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: