గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదా సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది.  ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు తీసుకు వస్తున్నా కొంత మంది నిర్లక్ష్యం మూలంగా నిండు ప్రాణాలు బలైపోతున్నాయి.  ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ కుటుంబ సభ్యులకు కన్నీరు మిగులుస్తున్నారు.  తాజాగా నగరంలోని సుచిత్ర సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

డివైడర్‌ను ఢీకొని కిందపడటంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.   అల్వాల్‌ నుంచి బోయిన్‌పల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు అనిల్‌కుమార్(22), రతన్ అంగే(22), అమన్‌రాజ్(22)లుగా గుర్తించారు. విద్యార్థులు మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు. వారి స్వస్థలం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్.

ఘటనా స్థలానికి చేరుకున్న పేట్‌బషీర్‌బాద్ పోలీస్‌స్టేషన్ సీఐ రవిచంద్రా, ఎస్సై శ్రీనివాస్ దర్యాప్తు చేస్తున్నారు. కాగా... శామీర్‌పేట శివారులో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: