అనంత‌పురం జిల్లాలోని హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం పేరు చెపితే చాలు ఆ పార్టీ టీడీపీకి పెట్ట‌ని కోట అని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఓడిపోలేదు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి దివంగ‌త మాజీ సీఎం, టీడీపీ వ్య‌వ‌స్థాపకులు ఎన్టీఆర్‌తో పాటు ఆయ‌న త‌న‌యులు ఇద్ద‌రూ నందమూరి హ‌రికృష్ణ‌, నంద‌మూరి బాల‌కృష్ణ ఇద్ద‌రూ కూడా ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం పార్టీకి స్ట్రాంగ్ కంచుకోట‌. ప్ర‌స్తుతం ఇక్క‌డ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నంద‌మూరి బాల‌కృష్ణ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు కాస్త త‌క్కువ‌గానే అందుబాటులో ఉంటున్నా అభివృద్ధి ప‌నుల విష‌యంలో మాత్రం దూసుకుపోతున్నాడు.

ambika lakshminarayana hindupur కోసం చిత్ర ఫలితం

వ‌చ్చే ఎన్నిక‌ల్లో హిందూపురంలో బాల‌య్య‌ను ఓడించేందుకు వైసీపీ ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ స్టార్ట్ చేస్తోంది. అక్క‌డ వైసీపీ జెండా మోసి, పార్టీ అభివృద్ది కోసం ఎంతో కృషిచేసిన న‌టుడిని కూడా ప‌క్క‌న పెట్టి మ‌రో కొత్త వ్య‌క్తిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాల‌య్య మీద బ‌రిలోకి దింపాల‌ని వైసీపీ ప్లాన్ చేస్తోంది. బలిజ సామాజికవర్గానికి చెందిన నవీన్‌ నిశ్చల్ హిందూపురం వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఇక్కడ పార్టీని బలోపేతం చేయడం కోసం ఎంతో శ్రమించారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న ఆయ‌న ఆ  త‌ర్వాత వైసీపీలోకి జంప్ చేసి గ‌త ఎన్నిక‌ల్లో బాల‌య్య మీద పోటీ చేశారు. 

naveen nischal hindupur కోసం చిత్ర ఫలితం

గ‌త ఎన్నికల్లో న‌వీన్ నిశ్చ‌ల్ ఓడిపోయినా నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని ప‌టిష్టం చేసుకుంటూ వ‌స్తున్నారు. అయితే ఇప్పుడు న‌వీన్‌ను త‌ప్పించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. అనంత‌పురం జిల్లా పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి న‌వీన్‌ను త‌ప్పించి వాల్మీకి సామాజిక‌వ‌ర్గానికి చెందిన అంబికా లక్ష్మీనారాయ‌ణ‌కు టిక్కెట్ ఇవ్వాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ల‌క్ష్మీనారాయ‌ణ టీడీపీలో ఉన్నారు. హిందూపురంనియోజ‌క‌వ‌ర్గంలో వాల్మీకులు ఎక్కువ‌. ఇక గ‌త ఎన్నిక‌ల్లో కూడా బాల‌య్య 16 వేల ఓట్ల తేడాతోనే గెలిచారు.


ప్ర‌స్తుతం టీడీపీలో బ‌ల‌మైన లీడ‌ర్‌గా ఉన్న అంబికాను పార్టీలోకి తీసుకువ‌చ్చి వైసీపీ నుంచి పోటీ చేయిస్తే బాల‌య్య‌కు గ‌ట్టి ప్ర‌త్య‌ర్థి అవుతార‌ని మిథున్‌రెడ్డి భావిస్తున్నార‌ట‌. దీంతో ఇప్పుడు ఈ విష‌యం అనంత రాజ‌కీయాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. అయితే న‌వీన్ నిశ్చ‌ల్‌ను మారిస్తే వైసీపీ కేడ‌ర్ చాలా వ‌ర‌కు పార్టీకి గుడ్ బై చెప్పేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అంబికా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు వైసీపీ టిక్కెట్ ఇస్తే న‌వీన్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన‌లో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తార‌ని ఊహాగానాలు హిందూపురంలో వినిపిస్తున్నాయి. మిథున్‌రెడ్డి ప్ర‌య‌త్నాలు ఎలా ఉన్నా న‌వీన్ మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి తానే పోటీ చేస్తాన‌ని ఈ విష‌యంలో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గేది లేద‌ని చెపుతున్నారు. మ‌రి హిందూపురం వైసీపీ రాజ‌కీయం ఎలా ట‌ర్న్ అవుతుందో ?  చూడాలి.

mp mithun reddy images కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: