ఈ మద్య పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పై తనదైన కామెంట్స్ తో ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్నాడు ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్. ఆ మద్య బుల్లితెరపై ‘బిగ్ బాస్’ తో పరిచయం అయిన కత్తి మహేష్ జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాన్ రాజకీయాలపై కామెంట్ చేశాడు. దాంతో పవన్ ఫ్యాన్స్ ఆయనను మీడియా సాక్షిగా బండ బూతులు తిడుతూ నానా యాగి చేశారు. కొంత కాలంగా పవర్స్టార్, జనసేన అధినతే పవన్ కల్యాణ్పై కత్తి మహేష్ విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.
ప్రస్తుతం ఏపీలోని పలు ప్రాంతాల్లో పవన్ చేస్తున్న వ్యాఖ్యలను కత్తి మహేష్ ఫేస్బుక్ పేజీ వేదికగా విమర్శిస్తున్నారు. తాజగా పవన్పై, సీఎం చంద్రబాబుపై మహేష్ విమర్శలు చేశారు. ఆయన స్థాపించిన పార్టీ ‘జనసేన కాదు.. అది కాపుసేన’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా శుక్రవారం విజయవాడలో జనసేన కార్యకర్తలో జరిగిన భేటీలో మాట్లాడుతూ.. నాకు కులమే కాదు, కుటుంబ భావన కూడా లేదు.
నాకు కులాల ఐక్యత ఉన్న అమరావతి కావాలి. అప్పుడే జనసేన ఆశయాలు నెరవేరుతాయని ఉద్వేగంగా ప్రసంగించిన విషయం తెలిసిందే.
దీనిపై కత్తి మహేష్ మరోసారి తన దైన శైలిలో విమర్శించారు..చంద్రబాబుగారు దయతో కొన్ని సీట్లు కేటాయించి వచ్చే ఎన్నికల్లో అయినా హోదా కల్పించకపోతే మరో జనరేషన్ యూత్ వెర్రివెంగలప్పలుగా మిగిలిపోతారు. జనం లేరు. సేన లేదు. పిచ్చి అభిమానులు, కుల పిచ్చిగాళ్లు మాత్రం ఉన్నారు` అని కామెంట్ చేశారు.
పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ కాదని ఆయన రాజకీయ ‘అజ్ఞానవాసి’ అంటూ దుయ్యపట్టారు కత్తి మహేష్. రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్న పవన్.. కాపు రిజర్వేషన్లకు ఎలా మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు.. స్పెషల్ ప్యాకేజీకి, ప్రత్యేక హోదాకు తేడా లేదనేస్తాడు. ఆయన చంద్రబాబు పిలిస్తే వస్తారో.. పని అయిపోయిన తరువాత మళ్లీ షూటింగ్లకు వెలిపోతారు. ఇదో పెద్ద డ్రామా అంటూ పవన్పైన తెలుగు దేశం ప్రభుత్వంపైన విమర్శల దాడి చేశారు కత్తి.