అప్పుల బాధతో పాటు కరంటు కోతతో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను తెలంగాణ టిడిపి బృంధం సోమవారం పరామర్శించనుంది. మెదక్ జిల్లా నంగునూరు మండల పరిధిలోని నాగరాజుపల్లి, నర్మెట గ్రామాల్లో సంపత్ రెడ్డి, కొమ్మూరు చంద్రారెడ్డిలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కాగా సంపత్ రెడ్డి కుటుంబాన్ని టిఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పరామర్శించింది. నేడు సంపత్ రెడ్డి కుటుంబంతో పాటు ఆత్మహత్య చేసుకున్న కొమ్మూరు చంద్రారెడ్డి కుటుంబాన్ని తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేల బృందం పరామర్శించనుంది. కాగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడరాదని, ఇటువంటి కరువు పరిస్థితుల్లో రైతులు మనోనిబ్బరంగా ఉండాలని ఎమ్మెల్యేలు సూచించారు. సోమవారం నాడు బాధిత రైతుకుటుంబాలను పరామర్శించనున్న తెలంగాణ ఎమ్మెల్యేల బృందంలో తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేల ఫోరం కన్వీనర్ ఎర్రబల్లి దయాకర్ రావు, హన్మంతరావు, మోత్కుపల్లి నర్సీంలు తదితర ఎమ్మెల్యేలుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: