తమ పార్టీ అధిష్టానంతో కుమ్మక్కు అయినందు వల్లనే జగన్ కు బెయిలొచ్చిందని.. ఈ మధ్య లగడపాటిరాజగోపాల్ ప్రచారం చేస్తున్నాడు. దీని గురించి మీడియా జగన్ ను వివరణ అడగగా.. ఆయన తీవ్రంగా రియాక్టయ్యాడు. లగడపాటిని పెంటతో పోల్చాడు! 

లగడపాటి మాటలకు మాటలకు స్పందించడం అంటే.. అది పెంట మీద రాయి వేయడమేనని జగన్ మోహన్ రెడ్డి అన్నాడు. దీని వల్ల కలిగే ప్రయోజనం కన్నా.. నష్టాలే ఎక్కువగా ఉంటాయని జగన్ అభిప్రాయంకావొచ్చు. ఒక ఎంపీ.. కాంగ్రెస్ లో సీనియర్ నేత.. కోటీశ్వరుడు.. అయిన లగడపాటి మాటలను జగన్ మోహన్ రెడ్డి పూచిక పుల్లలా తీసివేయడం గమనార్హం!

మరి లగడపాటి జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎలా సమాధానం చెబుతాడు? అనేది ఆసక్తికరంగా మారింది. జగన్ కు కాంగ్రెస్ అధిష్టానంకు ఒప్పందం కుదిరందన్న ఈయన ఆరోపణపై జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా రియాక్టయ్యాడు.. మరి లగడపాటి రియాక్షన్ ఎలా ఉంటుందో అనేది ఆసక్తికరంగా ఉంది. లగడపాటి మాటలను జగన్ వద్దకు తీసుకెళ్లిన మీడియా. .జగన్ మాటలను లగడపాటి వద్దకు తీసుకెళ్తుంది కదా...! 


మరింత సమాచారం తెలుసుకోండి: