కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి బిజెపి లో భంగపాటు తప్పలేదు. ఆమె విశాఖ లేదా విజయవాడ లేదా ఒంగోలు ల లో ఏదో ఒక స్థానం నుంచి లోక్ సభకు పోటీచేయాలని ఆశించారు. కాని బిజెపి విడుదల చేసిన జాబితాలో ఆమె పేరు లేదు. విశాఖ నుంచి పార్టీ అద్యక్షుడు కె.హరిబాబు కు అవకాశం కల్పించారు. అలాగే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి వచ్చిన రఘురామ రాజుకు కూడా ఆశాభంగం ఎదురైంది.ఆయన నరసాపురం సీటును ఆశిస్తే ఆయన బదులు తాజాగా పార్టీలో చేరిన గంగరాజుకు కేటాయించారు.కాగా తిరుపతి నుంచి కారుమంచి జయరామకు అవకాశం ఇచ్చారు.రాజంపేట స్థానం గురించి ఇంకా ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: