ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం నాయకుడు మురళీ మోహన్ ను కూడా బుధవారం నాడు నామినేషన్ వేయవద్దని చెప్పడం కలకలం రేపుతోంది.ఆయన నామినేషన్ వేయడానికి అన్ని సిద్దం చేసుకున్న తరుణంలో టిడిపి నాయకత్వం నుంచి ఫోన్ వచ్చిందని, నామినేషన్ వేయకుండా వేచి ఉండాలని సూచించారని అంటున్నారు. దీనికి కారణం జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ సన్నిహితుడు పివి ప్రసాద్ కు రాజమండ్రి సీటు ఇవ్వవలసి వస్తుందన్న సందేహంతోనే ఆపారని ప్రచారం జరుగుతోంది. మరి ఇన్ని ఏళ్లుగా రాజమండ్రిలోనే కార్యకలాపాలు సాగిస్తూ ఆ సీటు పై ఆశలు పెంచుకునన మురళీమోహన్ కు ఆశాభంగం అవుతుందా?లేక చివరికి ఆయనకే టిక్కెట్ వస్తుందా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: