టీడీపీనేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్పై 1వ నగర పోలీసులు గురువారం ఎన్నికల నిబంధన ల ఉల్లం ఘన కేసు నమోదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో నారా లోకేష్ గత మంగళవారం జిల్లాలో ప్రచారం నిర్వహిం చేందుకు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా తె లుగుదేశం పార్టీ మేనేజర్ శ్రీనివాసులరెడ్డి లోకేష్ ప్రచార కార్యక్ర మానికి పోలీసుల అనుమతి తీసుకున్నారు. పోలీసుల అనుమతి ప్రకారం అయ్యప్పగుడి వద్ద నుండి కనకమహాల్ వరకు ప్రధాన రహదారి మీద మాత్రమే ర్యాలీని నిర్వహించి ఆర్ఆర్ వీధిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద సమావేశం నిర్వహించేందుకు వారు అనుమతి పొందారు.
అయితే నిబంధనలకు విరుద్ధంగా కాపువీధిలో లోకేష్ ర్యాలీ నిర్వహించడమే కాకుండా ప్రచారం చేయ డంతో ఒకటవ నగర సిీఐ మద్ది శ్రీనివాసరావు ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసు కెళ్ళి గురువారం ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై లోకేష్, జిల్లా టిడిపి మేనేజర్ శ్రీనివాసులరెడ్డిపై సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరింత సమాచారం తెలుసుకోండి: