ఈ మధ్య కాలంలో కింగ్ నాగార్జున నటించిన మూవీలు ఏవీ టాలీవుడ్ బాక్సాపీస్ వద్ద అంతగా రాణించలేక పోయినప్పటికీ, మూవీల హావా మాత్రం తగ్గటం లేదు. అయితే తాజాగా తన అప్ కమింగ్ ఫ్యామిలీ ఫిల్మ్ మనం మూవీపై నాగార్జున భారీగానే ఆశలు పెట్టుఉకున్నాడు. అదే విధంగా మాటివి సంస్థలో షేర్స్ కలిగివున్న నాగార్జున, తన మాటివి సంస్థ నుండే ఓ మెగా రియాలిటి షోను వైభవంగా స్టార్ట్ చేయబోతున్నాడు. ఒకప్పుడు అమితాబచ్ఛన్ స్టార్ట్ చేసిన కెబిసి షోను ఇప్పుడు నాగార్జున తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. దీనికి సంబంధించిన పూర్తివివరాలను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. మాటివి సంస్థ నుండి మీలో ఎవరు కోటీశ్వరుడు అనే అతిపెద్ద రియాలిటిషో స్టార్ట్ అవుతుంది. ఈ షోకు కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ షో కోసం మొత్తంగా 38 మంది టాప్ సెలబ్రిటిలతో మాటివి సంస్థ ఆడిషన్స్ నిర్వహించింది. వారందరిలో కంటే నాగార్జుననే ఈ షోకి బాగా ఉన్నాడని, మాటివి అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ చెప్పాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షోకు నాగార్జునకి భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ ఇచ్చినట్టు మాటివి సంస్థ తెలుపుతుంది. మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ఈ సిరీస్ కు నాగార్జునకి దాదాపు నాలుగు కోట్ల రూపాయల వరకూ రెమ్యునరేషన్ ఇచ్చినట్టు సమాచారం. మొత్తంగా నాగార్జున తన మూవీల కంటే ఈ షోలతోనే రెమ్యునరేషన్ ఎక్కువ సంపాదించుకోవచ్చని కొందరు అంటున్నారు. నాగార్జున ప్రారంభించిన మీలో ఎవరు కోటీశ్వరుడు అనే రియాలిటి షో సక్సెస్ ను సాధిస్తుందా? లేదా? ఈ టాపిక్ పై మీకామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: