కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శోభానాగిరెడ్డి మృతిచెందడంతో అక్కడ ఎన్నికల నిర్వహణపై ఈసీ మీమాంసలో పడింది. ఆళ్లగడ్డ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఎలక్షన్ కమిషన్ వర్గాలు సంప్రదిస్తున్నాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి చనిపోతే అక్కడ ఎన్నికలు వాయిదా పడతాయి. వైసీపీకి గుర్తింపు లేకపోవడంతో ఎన్నిక నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. శోభానాగిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ఈసీని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పష్టతకోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: