లార్డ్స్ టెస్టులో భారత్ ముంగిట అవకాశాలు నిలిచాయి. తొలి ఇన్నింగ్స్ లో ధోనీ సేన 295 పరుగులకు ఆలౌట్ అయింది. బదలుగా, బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టు రెండోరోజు ఆట చివరికి 6 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. ఇంగ్లండ్ యువకెరటం గారీ బల్లాన్స్ (110) సెంచరీతో ఆకట్టుకున్నాడు. కుక్ సేన భారీస్కోరు దిశగా సాగిపోతుందనుకుంటున్న తరుణంలో భువనేశ్వర్ కుమార్ పదునైన బౌలింగ్ తో అడ్డుకట్ట వేశాడు. భువీ 4 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ జట్టులో మొయిన్ అలీ 32 పరుగులు చేశాడు. కెప్టెన్ కుక్ (10) మరోసారి విఫలమయ్యాడు. కాగా, ఇంగ్లండ్ జట్టు భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 76 పరుగులు వెనకబడి ఉంది. చేతిలో నాలుగు వికెట్లున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: