చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు ఒకరికొకరు పొగడ్తలు గుప్పించుకున్నారు. తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తి వెంకయ్యనాయుడు అని సీఎం చంద్రబాబునాయుడు కొనియాడారు. అధికారపక్షంలో ఉన్నప్పటికీ వెంకయ్యనాయుడు ఎల్లప్పుడూ ప్రజలపక్షానే ఉంటారని కితాబిచ్చారు. కేవలం వెంకయ్యనాయుడి చొరవ వల్లే ఏపీకి అత్యధికంగా మెడికల్ సీట్లు వచ్చాయని తెలిపారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వముందని.. రాష్ట్రంలో టీడీపీ ఉందని.. దీంతో, రాబోయే కాలంలో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తామని అన్నారు. చంద్రబాబు పొగడ్తలకు వెంకయ్యనాయుడు కూడా సేమ్ సీన్ క్రియేట్ చేశాడు. ఎంతో పరిపాలనా అనుభవం ఉన్న చంద్రబాబు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమని వెంకయ్యనాయుడు చెప్పారు. చంద్రబాబుకు అండగా ఉండి తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం అందరం కలసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు పనిచేస్తానని అన్నారు. నెల్లూరులో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు వెనుక చంద్రబాబు కృషి కూడా చాలా ఉందని వెంకయ్య చెప్పారు. నెల్లూరు ప్రజలకు ఈ వైద్య కళాశాల చాలా ఉపయోగకరమని తెలిపారు. నెల్లూరులో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించిన అనంతరం ఇరువురు నాయుడ్స్ ప్రసంగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: