కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పోటీచేస్తుందా?లేదా అన్న చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత కె.పార్ధసారధి తాము నందిగామలో పోటీచేస్తామని ప్రకటించారు. కాని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు మరికొందరు టిడిపి నాయకత్వం కోరితే పోటీ చేయకుండా ఉంటామని చెబుతున్నారు.కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కు కూడా ఉప ఎన్నిక వచ్చి ఉంటే చెరో సీటు అన్న ప్రాతిపదిక వచ్చేది. కాని నందిగామ ఒక్క సీటుకే ఎన్నిక జరుగుతోంది.దీంతో ఇప్పుడు ఏమవుతుందన్న చర్చ జరుగుతోంది.టిడిపి తన అబ్యర్ధి గా దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ కుమార్తె సౌమ్యను పోటీలో పెడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే నందిగామలో ఎన్నిక జరిగితే అది ఇరు పక్షాలకు ప్రతిష్టాత్మకమే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: