భారతీయ జనతా పార్టి అధ్యక్షుడు అమీత్ షా ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. ఇద్దరు నేతలు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరిపారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, బీజేపి తో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. దేశంలో మోడీ హావా కోసాగితే, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టి విజయడంకా మోగించింది. రెండురోజుల పర్యటనలో భాగంగా, గురువారం మధ్యాహాన్నం అమీత్ షా హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన అమీత్ షా ను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ జనసేన పార్టి పెట్టినప్పటికీ ఎన్నికలలో పోటి చేయకుండా తెలుగుదేశం పార్టి, బీజేపి కి సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: