గొప్పవాళ్లుగా ఎదిగారంటే.. వాళ్లలో ఏదో ఒక ప్రత్యేకత ఉండనే ఉంటుంది. వ్యక్తిత్వం విషయంలో వాళ్లు కొన్ని విధాలుగా అయిన గ్రేటనిపించుకొంటారు. ఇప్పుడు భారతీయజనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహారాన్ని గమనిస్తే.. ఆయన తీరును పరిశీలిస్తే.. ఆయన ఆ స్థాయికి చేరడానికి కచ్చితమైన అర్హత ఉన్న వ్యక్తి అనిపిస్తున్నారు. రాజకీయాలు అంటే డాబుగా మారిన సమయంలో.. రాజకీయ నేత అంటే దర్పాన్ని ప్రదర్శించగల వ్యక్తి అనుకొంటున్న తరుణంలో అమిత్ షా తన సింప్లిసిటీతో ఆకట్టుకొంటున్నారు. అదుర్స్ అనిపిస్తున్నారు. భారతదేశంలోని అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల్లో ఇప్పుడు అమిత్ షా ఒకరు. అందులో ఎటువంటి సందేహం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అధ్యక్షుడు అంటే.. ఆయన కోరింది ఇట్టే దిగివస్తుంది. అటువంటి వ్యక్తి ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో ఆయన తీరును గమనిస్తే.. ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద రాలేదు! మూడు విమానాలు మారి హైదరాబాద్ వచ్చారట, స్టార్ హోటళ్లు వద్దని చెప్పి, పార్టీ ఆఫీసులోని రూమ్ లోనే బస చేస్తారన్నారట. అయితే అక్కడ సెక్యూరిటీ సమస్య ఉందని... చెబితే చివరాఖరికి ఒక ప్రభుత్వ భవనంలో ఉండటానికి ఒప్పుకొన్నారట. ఇక అమిత్ షా హైదరాబాద్ కు వచ్చిన నేపథ్యంలో ఆయన భార్య తిరుపతి వెళ్లి రావాలని అడిగితే.. ఇక్కడి బీజేపీ నేతలు ఆమె కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ అయ్యారట. అయితే అందుకు అమిత్ షా ఒప్పుకోలేదని సమాచారం. మమూలుగా హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే విమానాల్లోనే ఆమెకు టికెట్ బుక్ చేసి పంపించారట. అమిత్ షా ఎప్పుడు ఎక్కడికి ప్రయాణించాలన్నా ఎకానమీ క్లాస్ లోనే ప్రయాణిస్తున్నారనే విషయం కూడా ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. మరి జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు ఇంత సింప్లిసిటీతో వ్యవహరించడం నిజంగానే గ్రేటే! ------------

మరింత సమాచారం తెలుసుకోండి: