తెలుగుదేశం వాళ్లు, తెలుగుదేశం అధినేత ఇప్పుడైతే సుద్దులు చెబుతున్నారు కానీ... గతంలో ఆ స్థానాన్ని వాళ్లు అవమానించిన విషయాన్ని ఎవరైనా మరిచిపోగలరా?! స్పీకర్ పదవిలో కూర్చొన్న వ్యక్తిని రౌడీ అని వ్యాఖ్యానించిన చరిత్ర కూడా తెలుగుదేశం నేతలకు ఉంది. ఇది ఏ దశాబ్దాల నాటి చరిత్రనో కాదు. క్రితం టర్మ్ కు సంబంధించిన చరిత్రే ఇది. స్పీకర్ స్థానంలోకి కిరణ్ కుమార్ రెడ్డి చేరిన కొత్తలో.. తెలుగుదేశం ఆయనను స్పీకర్ గా ఒప్పుకోనే ఒప్పుకోలేదు! ఎందుకంటే.. దశాబ్దాలుగా కిరణ్ రెడ్డికి, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుకి తీవ్రమైన వైరుధ్యాలున్నాయట. కిరణ్ తండ్రి హయాం నుంచే చంద్రబాబుకు వాళ్ల కుటుంబంతో రాజకీయ విభేదాలున్నాయట. అంతకు ముందు కిరణ్ కూడా చీఫ్ విప్ గా ఉండి తెలుగుదేశం పై తీవ్రమైన విమర్శలు చేశారు. మరి అలాంటి వ్యక్తిని మేము స్పీకర్ గా ఎలా ఒప్పుకొంటాం.. అని తెలుగుదేశం వాళ్లు వ్యాఖ్యానించారు. అయినా వెనక్కు తగ్గక వైఎస్సార్ కిరణ్ ను స్పీకర్ గా చేశారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ స్థానంలో కూర్చొన్నది హద్దు తెలుగుదేశం వాళ్లు ఆయనపై విమర్శలు చేయని రోజు లేదు. ఒకదశలో సహనం కోల్పోయిన తెలుగుదేశం సభ్యులు కిరణ్ పై అవిశ్వాసం పెడతామన్నారు.. గాలి ముద్దుకృష్ణమనాయుడు అయితే కిరణ్ కుమార్ రెడ్డి రౌడీ స్పీకర్ అని వ్యాఖ్యానించాడు! చిత్తూరు జిల్లాకే చెందిన తమకు కిరణ్ రౌడీయిజం గురించి తెలుసనని గాలి వ్యాఖ్యానించాడు! మరి అదీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ స్పీకర్ స్థానానికి ఇచ్చిన విలువ. మరి వారే ఇప్పుడు ఈ విధంగా స్పీకర్ స్థానానికి గౌరవం ఇవ్వాలని మాట్లాడటం విడ్డూరంగా ఉంది కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: