వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదిగినా.. చిన్న చిన్న కోర్కెలు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి కోర్కెలు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గౌడ్ ను వెంటాడాయో ఏమో.. అర్ధరాత్రి సెక్యూరిటీని వదిలేసి హైదరాబాద్ లోని పంజాగుట్ట-సికింద్రాబాద్ రోడ్డుపై రయ్ రయ్ మంటూ రాయల్ ఎన్ ఫీల్డ్ పై షికారు చేశారు. మంత్రి అయ్యాక మీటింగ్, సందర్శకులతో బిజీగా ఉండే పద్మారావు ఆటవిడుపు కోసం తన కార్యకర్తలతో కలిసి రోడ్లపై ఎంజాయ్ చేశారు. తన అభిమానులు, కార్యకర్తల కోరికను తొలుత సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. అయితే చివరికి రాయల్ ఎన్ ఫీల్డ్ పై రైడ్ చేస్తూ.. తన కార్యకర్తను వెనుక కూచోపెట్టుకుని ఫ్లై ఓవర్లపై పద్మారావు ఎంజాయ్ రైడ్ ముగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: