తెలంగాణ పిసిసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పటాన్ చెరులో గురువారం విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తల కోసుకుంటానని చెప్పినా తల తెగిపడలేదని,ఇచ్చిన హామీలు నెరవేరలేదని తీవ్రంగా విమర్శించారు. అలాగే కెసిఆర్ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాట మార్చారని పొన్నాల దుయ్యబట్టారు. ఆయన ఇంకా మాట్లాడుతూ రైతులకు సకాలంలో సొమ్ములు, విత్తనాలు ఇవ్వబట్టే తమ పదేళ్ళ కాలంలో రైతుల ఆత్మహత్యలు తగ్గు ముఖం పట్టాయని తెలిపారు. ఈ వందరోజుల కెసిఆర్ పాలనలో అలాంటి పరిస్థితి ఎక్కడా కనపడలేదని దమ్ముంటే కెసిఆర్ తమతో చర్చలకు రావాలని పొన్నాల సవాల్ విసిరారు. ఇక మెదక్ లో ప్రజలు కెసిఆర్ కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. అటుపై కెసిఆర్ కు విద్యుత్ పై అవగాహన ఉందా? మూడేళ్ళలో 15వేల మెగావాట్ల విద్యుత్ ను ఇస్తాననడం నమ్మదగిన మాటేనా? అంటూ పొన్నాల ధ్వజమెత్తారు. ఇక పార్టీలు మారి తెలంగాణ ఉద్యమ ముసుగులో కెసిఆర్ సొమ్ము చేసుకున్నారని పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: