మెగా హీరో అల్లుఅర్జున్ అంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ క్రేజ్ ఉంది. అల్లుఅర్జున్ కి చాలా మంది చాలా రకాలుగా గిప్ట్ లు ఇస్తుంటారు. అభిమానంతో వచ్చిన గిప్ట్ లు కాబట్టి ఈ మెగా హీరో సైతం కాదని చెప్పకుండా వాటిని తీసుకుంటూనే ఉంటాడు. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. రెండు కోట్ల రూపాయలు విలువ చేసే గిప్ట్ ని అల్లుఅర్జున్ ఓ డైరెక్టర్ కి ఇచ్చాడు. అంతే కాకుండా తనేంటో కూడ ఆ డైరెక్టర్ కి వివరించాడు. అల్లుఅర్జున్ వద్ద నుండి రెండు కోట్ల రూపాయల గిప్ట్ ని అందుకున్న డైరెక్టర్ గుణశేఖర్. ఇంతకీ మేటర్ ఏంటంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పీరియాడిక్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’ సినిమాలో గోనగన్నా రెడ్డి పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. తన పార్ట్ కి షూటింగ్ చాలా రోజుల క్రితమే ఫినిష్ చేసాడు. అయితే ఈ మూవీలో గోన గన్నారెడ్డి పాత్రని చేయమని గుణశేఖర్, అల్లుఅర్జున్ ని అడిగితే, అల్లుఅర్జున్ ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే ఒప్పకున్నాడు. ఆ సమయంలో అల్లుఅర్జున్ రెమ్యునరేషన్ ఎంత అనే విషయం ఫైనలైజ్ కాకుండా, అలాగే కనీసం ఆ తరహా మాటలకు జరగకుండానే షూటింగ్ స్టార్డ్ అయింది. ఇప్పుడు రుద్రమదేవి మూవీలో అల్లుఅర్జున్ కి సంబంధించిన షూటింగ్ పూర్తిగా అయిపోయంది. ఇటీవలే ఈ చిత్ర డైరెక్టర్ గుణశేఖర్ అల్లు అర్జున్ కి రెమ్యునరేషన్ గురించి మాట్లాడటానికి వెళితే అల్లు అర్జున్ రెమ్యునరేషన్ వద్దని అన్నాడు. తెలుగు హిస్టరీ మీద షూట్ చేస్తున్న ఈ సినిమా కావున ఫ్రీగా చేసానని చెప్పి పంపించాడని బన్ని సన్నిహితులు చెబుతున్నారు. దీంతో బన్ని చేస్తున్న సపోర్ట్ కి ఈ చిత్ర టీం చాలా హ్యాపీగా ఉన్నారు. బన్నీది కీలక రోల్ కాబట్టి కనీసం ఈ మూవీలో రెండు కోట్ల రూపాయలు అయినా రెమ్యునరేషన్ గా తీసుకుంటాడని గుణశేఖర్ భావించాడంట. ఇప్పుడు అల్లుఅర్జున్ రెమ్యునరేషన్ ఆశించకపోవడంతో నాకు రెండు కోట్ల రూపాయలు, వెలకట్టలేనంత గౌరవాన్ని గిప్ట్ గా ఇచ్చావు అంటూ గుణశేఖర్, అల్లుఅర్జున్ తో చెప్పాడంట. అనుష్క, రానా ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: