దళిత మంత్రి పై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరుపారేసుకున్నారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ విమర్శించింది. ఆ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు మంత్రి రావెళ్ల కిషోర్ బాబును మందలించినట్లు వార్తలు వచ్చాయి. అధికారులను మాట్లాడనివ్వండని,మంత్రిని గదమాయించారని కదనం. ఈ నేపధ్యంలో కల్పన మాట్లాడుతూ దళిత మంత్రిపై చంద్రబాబు నోరు పారేసుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. అర్ధం పర్దం లేని పధకాలు పెడుతూ చంద్రబాబు గందరగోళం సృష్టిస్తున్నారని ఆమె అన్నారు. జన్మభూమి కార్యక్రమం గురించి వివరణ కోరగా, స్పష్టత ఇవ్వవలసిన సిఎం వారి మైకులు కట్ చేశారన్నారు. ఎక్కువ మాట్లాడుతున్నారంటూ ఒక దళిత మంత్రిపై చంద్రబాబు నోరుపారేసుకున్నట్లు తెలిసిందని కల్పన వ్యాఖ్యానించారు.చంద్రబాబు వ్యవహార శైలి చేతగాని వారికి కోపం ఎక్కువ అన్నట్లుగా ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: