అచిన్, సార్థక్. ఢిల్లీకి చెందిన ఈ సోదరులు రియాల్టీ గేమ్ షో.. కేబీసీ(కౌన్ బనేగా కరోడ్ పతి)లో మొదటిసారిగా.. ఏకంగా ఏడు కోట్లను గెలుచుకున్నారు. మొత్తం 14 ప్రశ్నలకూ సరైన సమాధానాలు చెప్పిన ఈ సోదరులు రూ.7 కోట్లను సొంతం చేసుకున్నారు. దీని కోసం వారు నాలుగు సార్లు లైఫ్లైన్స్ను ఉపయోగించుకున్నారు. ఈ కార్యక్రమానికి యాంకర్గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ‘ఇదో అద్భుతమైన అనుభవం’ అని బ్లాగులో తన సంతోషాన్ని పంచుకున్నారు. అంతేకాదు విజేతలతో కలిసి ఉన్న ఫొటోను కూడా ఉంచారు.
ఇద్దరిలో అచిన్ మార్కెటింగ్ మేనేజర్ కాగా, సార్థక్ విద్యాభ్యాసం చేస్తున్నారు. గతంలోనూ కొన్ని సార్లు ఈ కార్యక్రమానికి వారు ఎంపికైనప్పటికీ, ఈ సారి వారిని అదృష్టం వరించింది. కాగా ఈ క్షణం కోసం కార్యక్రమం ప్రారంభం నుంచి ఎదురు చూస్తున్నామని కేబీసీ నిర్మాత సిద్ధార్థ బసు ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షుడు గౌరవ్ సేథ్ విజేతలకు తమ అభినందనలు తెలియచేశారు.ఇుఽ4ఔఇు2ఊ4ఔఇఇ4ఔఇ్చ4ఔఎఆ4ఔఇగ4ఔఎః
మరింత సమాచారం తెలుసుకోండి: