తెలంగాణ విద్యార్ధులకు ఆర్ధికసాయం (పాస్ట్) స్కీమ్ పై తాను వ్యాఖ్యానించినట్లే జరిగిందని తెలుగుదేశం అదినేత, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.తాను ఆ స్కీమ్ కరెక్టు కాదని, ఇక్కడ ఉన్నది అంతా తెలుగువారేనని తాను చెప్పానని, ఇప్పుడు హైకోర్టు కూడా అదే చెప్పిందని చంద్రబాబు అన్నారు. ఆ నాడు తాను తెలుగు విద్యార్ధులకు చెరి సగం భరిద్దామని చెప్పానని, అయినా, ఆ తర్వాత 58:42 గా చేద్దామన్నా వినలేదని, మీ పిల్లలకు మీరు కట్టుకోండని అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ దెబ్బతినరాదని ఆయన అన్నారు.హైదరాబాద్ ను తానే అబివృద్ది చేశానని చంద్రబాబు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: