తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దుర్గాష్టమి, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుమీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే విజయదశమి పండుగ రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, అంతిమ విజయం మాత్రం మంచిదేనని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. లోకంలోని ప్రజలందరినీ రక్షించే దుర్గామాత.. రాష్ట్ర ప్రజలకు కూడా సుఖశాంతులు అందించాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో తులతూగాలని ఆయన అభిలషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: