తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టులో షరతులతో కూడిన బెయిల్ లభించిన నేపథ్యంలో ఆమె పార్టీ అన్నా డీఎంకే కార్యకర్తల్లో సంబరాలు మిన్నంటాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడే జయకు బెయిల్ లభించడంతో సంబరాలు హోరెత్తుతున్నాయి. జయ అభిమానులు, పార్టీ కార్యకర్తల్లో సుప్రీంకోర్టు తీర్పు ఒక్కసారిగా ఉత్సాహాన్ని నింపింది. జయ జైలులో ఉన్న నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ సంబరాలే వద్దకునుకున్న కార్యకర్తలు, జయకు బెయిల్ రావడంతో భారీ ఎత్తున సంబరాలకు తెర తీశారు. ఎంజీ రామచంద్రన్ ఫొటోలు, జయలలిత ఫొటోలతో ప్లకార్డులు పట్టుకుని, టపాసులు కాలుస్తూ, డాన్సులు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ఇప్పుడిప్పుడే ప్రారంభమైన ఈ సంబరాల హోరు క్రమంగా తమిళనాడును ముంచెత్తనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: