శోభా నాగిరెడ్డి మరణంతో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి వచ్చిన ఉప ఎన్నికల్లో ఆమె కూతుర్లు ఇద్దరూ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ప్రకటించినట్టుగా భూమా అఖిల ప్రియతో పాటు శోభా నాగిరెడ్డి, భూమనాగిరెడ్డిల రెండో కూతురు మౌనికారెడ్డి కూడా నామినేషన్ వేయడం విశేషం. అయితే అఖిల ప్రియమాత్రమే క్యాండిడేట్ అని.. మౌనికారెడ్డి డమ్మీ అభ్యర్థిగా మాత్రమే నామినేషన్ వేసిందని తెలుస్తోంది. ఒకవేళ అఖిల ప్రియ నామినేషన్ లో లోపాలు ఉండి తిరస్కరణకు గురి అయితే మౌనికారెడ్డి బరిలో ఉండే విధంగా ఆమె చేత నామినేషన్ వేయించినట్టు తెలుస్తోంది. శుక్రవారం రోజున భూమా అఖిల ప్రియ నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేశారు, తల్లి సమాధిని దర్శించుకొని.. ఆలయాల్లో పూజలు చేసి.. ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు ఎస్వీమోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, సాయిప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి, మణిగాంధీ, ఐజయ్య, జయరాం, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, పార్టీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, భూమా నారాయణరెడ్డి, న్యాయవాది సూర్యనారాయణరెడ్డి తదితరులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: