హైదరాబాద్ శివార్లలో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం మురారిపల్లిలోని హనిబర్గ్‌ రిసార్ట్స్ లో యువతులకు అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఈ దాడులు చేశారు. రిసార్ట్స్ మేనేజర్ తో పాటు పదిమంది యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు పోలీసులపై ఎదురుదాడికి దిగినట్లు తెలుస్తోంది. పోలీసులు అరెస్ట్ చేసినవారిలో ఏడుగురు నైజీరియన్లు ఉన్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు వారిని తరలించారు. కాగా రిసార్ట్స్ లో రేవ్ పార్టీ జరగలేదని, కేవలం గెట్ టు గెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదని వారు పేర్కొన్నారు. మరోవైపు పోలీసులు దాడి చేస్తున్న సమయంలో మరికొంతమంది యువతీ యువకులు రిసార్ట్స్ నుంచి పరారీ అయినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: