ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఒక హీరో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్స్ తో రోమాన్స్ చేస్తూ ప్రేమను నడిపిన సినిమాలను చూసాము. అయితే దీనికి భిన్నంగా త్వరలో ప్రారంభం కాబోతున్న నాగార్జున, కార్తీలు నటిస్తున్న ఒక మల్టీ స్టారర్ సినిమాలో హీరోయిన్ పాత్ర ఒకటే అనే వార్తలు వస్తున్నాయి.  డైరెక్టర్ వంశీ పైడిల్లి దర్శకత్వంలో ప్రసాద్ పొట్లూరి నిర్మిస్తున్న ఈ మల్టీ స్టారర్ కధ ఒక హీరోయిన్ చుట్టూ తిరిగే ఇద్దరి హీరోల కధగా మారబోతోంది అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే హీరోలు ఎంపిక అయిన ఈ సినిమాకు వీరిద్దరితో రోమాన్స్ చేయగల హీరోయిన్ గురించి వేట మొదలైంది అని టాక్.  మొదట్లో జూనియర్, నాగార్జునలు నటిస్తారు అనుకున్న ఈ సినిమాలో జూనియర్ కు షాక్ ఇస్తూ అతడి పాత్రను కార్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఒక హీరో చుట్టూ ఇద్దరు హీరోయిన్స్ తిరిగే కధలకు అలవాటు బడ్డ తెలుగు ప్రేక్షకులు దర్శకుడు వంశీ పైడి పల్లి చేస్తున్న ఈ ప్రయోగాన్ని ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి.  కార్తితో పాటుగా నాగార్జునకు కూడా కోలీవుడ్ లో క్రేజ్ ఉండటంతో అటు టాలీవుడ్ ఇటు కోలీవుడ్ లను టార్గెట్ చేస్తూ తీస్తున్న ఈ సినిమా విజయవంతం అయితే ఇదే కోవలో మరి కొన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: