కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కన్నాలక్ష్మీనారాయణ బిజెపిలో చేరారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో కండువా వేసుకున్నారు. ఈ సందర్బంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్న మంచిపనులకు ఆకర్శితుడినై పార్టీలో చేరానన్నారు. త్వరలోనే మరికొంత మంది కాంగ్రెస్ నేతలు బిజెపిలో చేరతారని కన్నా అన్నారు. గుంటూరుకు చెందిన కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ ఓడిపోయారు. కన్నాను చేర్చుకోవడంలో బిజెపి కి పెద్ద వ్యూహమే ఉందంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బిజెపికి మద్దతునిస్తున్నారు. కన్నాను చేర్చుకోవడం ద్వారా కాపులపై బిజెపి కన్నేసిందంటున్నారు. రాష్ట్రంలో కాపులు కనీసం 20 నుంచి 30 అసంబ్లీ స్థానాల్లో కీలకంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: