తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఫిర్యాదు చేయనున్నట్టుగా ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ మేరకు తెరాస ఎంపీ బాల్క సుమన్ ఒక ప్రకటన చేశాడు. మరి ఫిర్యాదు ఏ అంశం గురించి? ఆంధ్ర, తెలంగాణ మధ్య ఉన్న గొడవల గురించినా... అంటే.. ఈ రెండూ కాదు.. శంషాబాద్ ఎయిర్ పోర్టు విషయంలో అని అంటున్నాడు ఈ తెరాస నేత. శంషాబాద్ ఎయిర్ పోర్టు దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై తెరాస పోరాటం కొనసాగుతోంది. తెలంగాణ గడ్డపై ఎన్టీఆర్ పేరుకు తావు లేదని ఈ తెరాస ఎంపీ అంటున్నాడు. కావాలంటే ఏపీలోని అన్ని విమానాశ్రయాలకూ ఎన్టీఆర్ పేరు పెట్టుకోవాలని.. అది కూడా చాలదనుకొంటే ఆంధ్రప్రదేశ్ కే పేరు మార్చుకోవాలని ఈ ఎంపీ అభిప్రాయపడ్డాడు. ఆంధ్రప్రదేశ్ కే ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి కానీ.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టవద్దని ఈ ఎంపీ అన్నాడు. ఢిల్లీలో ఈ నేత మాట్లాడుతూ...చంద్రబాబుపై ఎన్టీఆర్ కు ఫిర్యాదు చేయనున్నట్టుగా ప్రకటించాడు. టెర్మినల్ పేరు మార్మిడి పెద్ద కుట్ర అని బాల్క అన్నాడు. ఈ విషయంలో సమాధానం చెప్పాల్సి వస్తుందని.. విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు సమావేశాలకు కూడా హాజరు కావడం లేదని ఈ తెరాస ఎంపీ అన్నాడు. ఈ కుట్రలను ప్రధానమంత్రి మోడీకి తెలియజెప్పుతామని.. చంద్రబాబుపై ఫిర్యాదు చేస్తామని బాల్క సుమన్ ప్రకటించాడు. అయినా మోడీ, బాబులు మిత్రపక్షాలకు చెందిన నేతలు కదా.. ఫిర్యాదుతో ఫలితం ఉంటుందా!

మరింత సమాచారం తెలుసుకోండి: