తెలుగుదేశం తెలంగాణ నేతలలో ఏర్పడ్డ భిన్నాభిప్రాయాలు పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు కు చికాకు కలిగిస్తాయా?పార్టీ వర్గాల కధనం ప్రకారం టిడిపి ఫైర్ బ్రాండ్ గా పేరొందిన రేవంత్ రెడ్డి తీరుపై కొందరు నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.రేవంత్ పార్టీ సమావేశాలకు రారని, ఏదో ఒకటి మాట్లాడతారని, ఆ తర్వాత దాని గురించి పాలో అప్ చేయరని వారు ఆరోపించారు.ఇది అంగీకారయోగ్యంగాదని వారు పేర్కొన్నారు.

చంద్రబాబు వద్ద సమావేశమైన ఎర్రబెల్లి దయాకరరావు,ఎల్.రమణ తదితరులతో సంభాషణలు జరిగినప్పుడు ఈ ప్రస్తావన వచ్చిందని అంటున్నారు.కాగా టిడిపి తెలంగాణ నేతలను నిలబెట్టుకుని,పార్టీని పరిరక్షించుకునేందుకు గాను కొందరు ఈ ప్రాంత నేతలకు పదవులు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు.

సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు.అలాగే ముగ్గురు నేతలకు టిటిడిలో సభ్యత్వం ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.

...

మరింత సమాచారం తెలుసుకోండి: