స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్‌కోహ్లీ మరోసారి విచక్షణ కోల్పోయాడు. అయితే ఈసారి ప్రత్యర్థి ఆటగాళ్లతో గాకుండా ఓ జర్నలిస్టుపై చిందులు తొక్కాడు. వివరాల్లోకెళితే.. ప్రాక్టీస్ సెషన్ ముగించుకుని స్సింగ్‌రూమ్‌కు వెళ్తున్న కోహ్లీకి భారత జర్నలిస్టుల బృందం ఎదురైంది. వెంటనే కోహ్లీ ఆ బృందంలోని ఓ జర్నలిస్టును అసభ్యపదజాలంతో దూషించడం మొదలుపెట్టాడు.

అయితే తనను కోహ్లీ ఎందుకు తిడుతున్నాడో సదరు జర్నలిస్టుకు అర్థంకాలేదు. అక్కడే సహచర భారత ఆటగాళ్లకు సైతం ఏం జరుగుతుందో తెలియక ఆశ్చర్యపోయారు.అయితే వెంటనే కోపాన్ని తగ్గించుకున్న కోహ్లీ అసలు మా ఇద్దరి(అనుష్క శర్మ) గురించి జాతీయ దినపత్రికలో రాసిన జర్నలిస్టు మీ బృందంలో ఉన్నాడని అనుకున్నా, అందుకే అలా మాట్లాడానన్నాడు. తర్వాత ఆ జర్నలిస్టుకు కోహ్లీ క్షమాపణలు ప్పాడు. దీనిపై కోహ్లీతో మాట్లాడి కోపాన్ని తగ్గించుకోవాలని టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి చెప్పినట్లు తెలిసింది.

. .

. .

మరింత సమాచారం తెలుసుకోండి: