నరేంద్రమోడీకి టాలీవుడ్‌ నటుడు, బీజేపీ నేత శివాజీ లేఖ రాశా రు. తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడటానికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని ఆ లేఖలో ఆయన కోరారు. దీనిపై స్పందించిన పీఎంఓ వర్గాలు వచ్చే వారం ఢిల్లీకి పిలుస్తామని చెప్పారని తెలిపారు. ప్రధాని మోడీపై తనకు పూర్తి నమ్మకముం దని హీరో శివాజీ చెప్పారు. ఆయన మాట తప్పే మనిషి కాదని అన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల ప్రచారంలో కూడా మోడీ హామీ ఇచ్చారని, ఎట్టి పరిస్ధితిలోనూ ఆయ నిచ్చిన వాగ్దానాన్ని నిలుపుకుంటారని ఆ నమ్మకం తనకి ఉందన్నారు. ప్రధాని మోడీతో ఏపీకి ప్రత్యేకహోదా, రెండు తెలుగు రాషా్టల్రకు కేటా యించిన బడ్జెట్‌పై కూడా తాను మాట్లాడతానని చెప్పారు.

ప్రధాని మోడీ తనకు తానుగా ఏపీకి ప్రత్యేక హోదాపై మాట్లాడే దాగా ఎలాంటి అపో హలు పెట్టుకోవద్దని సూచించారు. ప్రత్యేక హోదా, బడ్జెట్‌పై ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో వెంకయ్య నాయుడు పోరా డారన్న సంగతిని శివాజీ గుర్తు చేశారు. ఆనాడు సభలో మంత్రి జైరామ్‌ రమేష్‌ అనేక విషయాలు చెప్పా రన్నారు.

ఆ సందర్భంలో కేవీపీ, చిరం జీవి, జేడీ శీలం లాంటి నేతలు సభ లోనే ఉన్నారని ఆయన చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో రాజ్యాంగ పరమైన అవ …రోధా లుంటే దానికి కొన్ని మార్పులు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభు త్వంపై ఉందని, దీని కోసం అన్ని పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. రెండు తెలుగు రాషా్టల్ర ప్రజలు సహకరించుకుంటేనే అందరం సం తోషంగా ఉంటామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: