అసెంబ్లీ ప్రాంగణంలో అనుచిత వ్యాఖ్యల జోరు కొనసాగుతోంది. మొన్నటిదాకా వైసీపీ ఎమ్మెల్యే రోజా అధికారపక్ష సభ్యులపై నోటికొచ్చినట్లు మాట్లాడితే, తాజాగా ఆమెపై టీడీపీ సభ్యులు అదే తరహాలో విరుచుకుపడుతున్నారు. రెచ్చగొట్టి చీర లాగించుకోవాలని రోజా చూస్తున్నారని ప్రభుత్వ విప్ యామినీబాల వ్యాఖ్యానించారు.అయితే, అసెంబ్లీలో దుశ్శాసన పర్వం సాగనివ్వబోమని పేర్కొన్న ఆమె, రోజా ఎంతమేర రెచ్చగొట్టినా, తాము మాత్రం హద్దు మీరబోమని స్పష్టం చేశారు. 


వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు

 Image result for ap assembly mla roja
మరోవైపు తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలంటూ మంత్రి పీతల సుజాత విసిరిన సవాల్‌కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. శాసనసభలో తనకు తగినంత సమయం కేటాయిస్తే మంత్రి అవినీతిని ఆధారాలతో నిరూపిస్తానని చెప్పారు.సభలో టీడీపీ సభ్యులు తమను అనరాని మాటలంటుంటే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని రోజా ప్రశ్నించారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి తనపై ఫిర్యాదు చేయడంపై స్పందించిన ఆమె, పొరపాటున కూడా తానెప్పుడూ వికలాంగులను కించపర్చలేదని వివరణ ఇచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: