ఇది అవమానంగా బావించిన రోష్ని తన బావ అమిత్ తో చెప్పింది. దీంతో చిర్రెత్తిపోయిన అమిత్ కొంతమంది స్నేహితుల దాదా 20 మంది వరకు కలిసి అర్జున్ ఆఫీసుకు వెళ్లి ఆయను ప్రేమ్ నగర్ ప్రాంతంలోని ఇంటికి తీసుకెళ్లి చితక్కొట్టారు. అంతే కాదు ఆయనకు గుండు కూడా గీశారు. తర్వాత అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. . తన భార్య పూజ, మరో నటుడిపై కూడా రోష్ని బంధువులు దాడికి పాల్పడినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితునిపై ప్రేమ్ నగర్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలైంది. అతడిని అరెస్టు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఏఎస్పీ రాజీవ్ మల్హోత్రా చెప్పారు.