భవిష్యత్తు.. మనిషికి ఎప్పటికీ ఆసక్తికలిగించే అంశమే..తమ జీవితంలో రేపు ఏం జరగబోతోంది.. ముందు ముందు ఎలా గడపబోతాం.. జీవితంలో అనుకున్నది సాధిస్తామా.. నచ్చిన అమ్మాయిని పెళ్లాడతామా.. ఎన్నేళ్లు బతుకుతాం.. ఎప్పటికైనా ఆర్థికంగా సంపన్నులం అవుతామా.. ఇలా ఎన్నో ఉత్కంఠరేపే ప్రశ్నలు.

వీటికి జ్యోతిషంలో సమాధానం దొరుకుంది. అందుకే ఆ శాస్త్రమంటే అంత క్రే్జ్.. అయితే అవి నిజమవుతాయా..కాదా అన్నది వేరే విషయం. ఈ జ్యోతిష్యంలో ప్రవీణులైన వారెందరో రెండు చేతులా సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. సహజంగా బ్రాహ్మణులే ఈ రంగంలో ఎక్కువగా ఉంటారు. 

కానీ.. బుడగ జంగాల సామాజిక వర్గానికి చెందిన కొందరు ఈ రంగంలో కోట్లకు పడగలెత్తడం సంచలనం కలిగిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామంలోని బుడగ జంగాల కులస్తులు కొన్నేళ్లుగా జ్యోతిష్యం చెప్పుకుంటూ విపరీతంగా డబ్బు గడించారు. హైదరాబాద్, ముంబైల్లోని కోటీశ్వరులకు కూడా వీరిపై గురి కుదరడంతో వీరు లక్షాధికారులు, ఆ తర్వాత కోటీశ్వరులు అయ్యారు. 

ఆ తర్వాత ఆ సంపాదనలో స్థిరాస్థి వ్యాపారంలోనూ అడుగు పెట్టి.. లక్షలు కాస్తా కోట్లుగా మలచుకున్నారు. ఆ మధ్య పెదఅవుట్లపల్లి వద్ద జరిగిన కాల్పుల ఘటనతో వీరి నేపథ్యం ప్రపంచానికి తెలిసింది. ఆగ్రామంలోని దుర్గారావు కుటుంబానికి.. నాగేశ్వరరావు కుటుంబానికి మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం దుర్గారావును ప్రత్యర్థులు హతమార్చారు. 

దీనికి ప్రతిగా... దుర్గారావు కుటుంబ సభ్యులు పెద్ద ఔట్ల పల్లి వద్ద జాతీయ రహదారిపై కాపుకాచి.. నాగేశ్వరరావు, ఆయన కుమారులను చంపేశారు. తాజాగా హైదరాబాద్ సరూర్ నగర్లో దుర్గారావు కుటుంబానికి చెందిన నాగరాజుపై సరూర్‌నగర్‌లోని జింకలబావి కాలనీలో కాల్పులు జరిగాయి. వీరి నేపథ్యం.. పాతకక్షలతో జరుగుతున్న హత్యలు.. క్రైమ్ సినిమాను తలపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: