ఉత్తర టెక్సాస్ లోని ఓల్డ్ లేక్ హైలాండ్స్ లో ఉన్న దేవాలయంలో పై కొందరు  దుండగులు దాడి చేశారు. అంతేకాక కొన్ని అభ్యంతరకర ఫోటోలు కూడా అతికించి వెళ్లారు. కేవలం హిందూ దేవాలయాలను విమర్శించడం లక్ష్యంగా వీరు ఈ పనికి తెగబడి ఉంటారని కొందరి అభిప్రాయం.  దీనిపై డల్లాస్ పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు.  అయితే  అమెరికాలో హిందూ దేవాలయాలపై దాడి జరగడం ఇది మూడోసారి అవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.


దేవాలయంపై అసభ్య గీతలు రాసి చిత్రం


ఈ ఘటనపై   దేవాలయ బోర్డులో పని చేస్తున్న కృష్ణ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తమ దృష్టికి గత సోమవారం వచ్చినట్లు పేర్కొన్నారు.   ఇది మొత్తం ఒక జాతినే అవమానపరిచే చర్యగా ఆయన అభివర్ణించారు. ఇలాంటి దాడులు జరగకుండా పలువురు భక్తులు ఆలయానికి ఫెన్సింగ్‌తో కూడిన ప్రహారీని నిర్మిస్తున్నారు. హిందువులు, హిందువేతరులు కూడా దేవాలయ పునర్నిర్మాణానికి సహకరిస్తామని ముందుకు వచ్చారు.


దేవాలయంపై అసభ్య రాతలు



గత మూడు నెలల్లో అమెరికాలో హిందూ దేవాలయాలపై దాడి జరగడం ఇది మూడోసారి. ఇదే తరహా ఘటన గడిచిన ఫిబ్రవరి 15న సియాటెల్ ప్రాంతంలోని దేవాలయం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దేవాలయ గోడపై స్వస్తిక్ రాసి ‘గెట్ ఔట్' అనే పదాలను రాశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: