ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధి లో చాలా మార్పు వచ్చింది అంటున్నారు కాంగ్రెస్ అభిమానులు, నేతలు. గత రెండు నెలలుగా విదేశీ యాత్ర చేసి వచ్చిన ఆయనలో చాలా మార్పు చోటు చేసుకుందట. .లోక్ సభలో కూడా రెండుసార్లు సందర్భానుసారంగా మాట్లాడి ఆకట్టుకున్నారు. హుందాగా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నిలదీసిన తీరు అందరినీ ఆశ్చర్య పరిచింది. అంతే కాదు ఆయన అందరితో కలివిడిగా ఉంటున్నారట. ఎన్నడూ లేని విధంగా ఆయన ఏకంగా పద్దెనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి కేదార్ నాద్ ఆలయానికి వెళ్లారు.అక్కడ ఆయన పూజలు నిర్వహించారు.


పాదయాత్రగా కేదార్ నాథ్ ఆలయానికి వెళ్తున్న రాహుల్ గాంధీ


రాహుల్ గాంధీ చేస్తున్న పనులు చూసి ఆయన తీరు చూసి పార్టీలో నూతనోత్సాహం వచ్చిందట. ప్రస్తుతం ఆయన పార్టీ వర్యవహారల్లో చురుకుగా పాల్గొంటున్నారట. ఇప్పుడు ఆయన పార్టీ నేతలతో కలిసి కేదార్ నాద్ కు పాదయాత్ర ద్వారా వెళ్లి జోష్ నింపడానికి ప్రయత్నించారు. నింజంగానే రాహుల్ గాంధీలో ఇన్ని మార్పులు రావడం ఒకింత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ అభిమానులు.


కేదారినాథ్ ఆలయంలో పూజలు నిర్వహించిన రాహుల్ గాంధీ



మరింత సమాచారం తెలుసుకోండి: