మహిళలపై గ్యాంగ్ రేపులు ప్రతిరోజు వార్తల్లో, మీడియాలో చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ చట్టాలు ఈ కామాంధులకు అస్సలు కనబడకుండా పోతున్నాయి. ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఉత్తర్ ప్రదేశ్. ఇక్కడ దారుణాలు చూస్తుంటే అసలు మనం సమాజంలో ఉన్నామా లేక అడవిలో క్రూరమృగాల మధ్యలో ఉన్నామా అన్న డౌట్ వస్తుంది. ఇక్కడ మహిళలపై, యువతులై చివరకు చిన్నారులపై కూడా కామాందుల ఏదో ఒక చోట అత్యాచారాలకు పూనుకుంటున్నారు. మరి చట్టం ఉంది కదా అంటే అవును చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది.
తాజాగా ఉత్తరప్రదేశ్ లోని మీరట్
ఒక 40 సంవత్సరాల మహీళకు దారుణంగా అత్యాచారం
చేశారు. ఇద్దరు దుండగులు పట్టపగలే ఓ యువతిని కారులో తిప్పుతూ అత్యాచారానికి
పాల్పడ్డారు. 40 ఏళ్ల యువతి మందులు కొనుగోలు చేయడం
కోసం నగరానికి వచ్చింది. సంజీవ్, మనోజ్
అనే ఇద్దరు యువకులు ఆమెను మభ్యపెట్టి మత్తమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు.
బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లాక కారులో తిప్పుతూ అఘాయిత్యానికి
పాల్పడ్డారు. అనంతరం ఓ కాలువ వద్ద ఆమెను పడేసి వెళ్లారు. పెట్రోలింగ్ సిబ్బంది
ఆమెను గమనించి సమీప ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు
కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.