మొన్న సంబంవించిన భూకంపానికి నెపాల్ అతాలాకుతలం అయిపోయింది. ఈ సంవత్సం అత్యంత విషాదకర పరిస్థతి అక్కడ నెలకొంది. దాదాపు 2200 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వెల మంది క్షతగాత్రులుగా మిగిలిపోయారు. భూకంపం ధాటికి అక్కడ మరుభూమినే తలపిస్తుంది. ఈ ఘటనలో పురాతన కట్టడాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్లు వేలసంఖ్యలో నేలమట్టమయ్యాయి. ఇప్పడు ఇక్కడ పేద, ధనిక అనే తేడాలు లేకుండా పోయాయి. అందరూ రోడ్డున్న పడ్డ పరిస్థతి వచ్చింది. అంతేందుకు సాక్షాత్తూ నేపాల్ అధ్యక్షుడు రామ్ భరణ్ యాదవ్ రాత్రంతా టెంటులో జాగారం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

భూకంపానికి నేలమట్టమైన భవన సముదాయాలు


నేపాల్ ప్రెసిడెంట్ రామ్ భరణ్ యాదవ్ అధికారిక నివాసంలో పగుళ్లు ఏర్పడ్డాయి.దీంతో గత రాత్రంతా ఆయన తన భద్రత సిబ్బందితో కలసి టెంట్ లో ఆరుబయట బస చేశారు. నేపాల్ ప్రెసిడెంట్ నివాసం ‘శీతల్ నివాస్’ను 150 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ భవనంలో వంటగదితో పాటు ఇతర గదుల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. కాగా, ప్రధాని సుశీల్ కొయిరాలా నివాసం ప్రధాన ద్వారం భూప్రకంపనలకు దెబ్బతింది.  ప్రకృతి భీభత్సానికి ఎవరైనా ఒకటే అన్న చందంగా మారింది. ఇప్పడు అక్కడ అన్ని రకాల సహాయక చర్యలు చేపడుత్నా క్షతగాత్రుల ఆహాకారాలు చూస్తుంటే ఎవరికైనా కన్నీరు వస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: