ఏపీలో బీజేపీ, టీడీపీ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, అనుకున్నంత నిధులు రాకపోవడంతో.. రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల నేతల మధ్య మాటలయుద్దం నడుస్తోంది. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజెపికి బానిస అని ఎపిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించడాన్ని ఎపి సమాచార శాఖ మంత్రి రఘునాధరెడ్డి తప్పు పట్టారు. చంద్రబాబు బాద్ షా అని ఆయన అన్నారు. రఘువీరారెడ్డి ప్రత్యేక హోదా కోసం దీక్ష చేపట్టడం వింత అని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ చేసిన దారుణ అన్యాయాన్ని ఎప్పటికి ప్రజలు మర్చిపోరని రఘునాథరెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ నేతలు ఇంత అన్యాయం చేసిన తర్వాత ప్రజలలోకి ఎలా వెళ్లగలుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. తనకైతే వారి పోకడలు చాలా సిగ్గుగా కనిపిస్తున్నాయని రఘునాదరెడ్డి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: