మహిళలపై రోజు అత్యాచారాలు జరుగుతున్నాయి అంటు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకు పోయిన మృగాళ్లు మన సమాజంలో నిర్లజ్జగా తిరుగుతూనే ఉన్నారు. ఒక స్త్రీ బయిటికి వెళ్లింది అంటే ఇంటికి వచ్చే వరకు భయపడాల్సిన పరిస్థతి దాపురించింది. గాంధీజీ ఎప్పుడైతే స్త్రీ అర్థరాత్రి రోడ్డుపై నిర్భయంగా నడవగలదో అప్పుడే స్వతంత్రం వచ్చినట్లు లెక్క అన్నారు. అర్ధరాత్రి సంగతి దేవుడెరుగు పట్టపగలే నడవాలంటే భయం వేస్తుంది అంటున్నారు నేటి మహిళలు. కారణం రోజు రోజుకు పెరిగిపోతున్న అత్యాచార కేసులు.
తాజాగా ఓ గర్భిణిపై గ్యాంగ్ రేప్ జరిగింది. పశ్చిమగోదావరి
జిల్లా పెదపాడులో శనివారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. గర్భిణీపై నలుగురు
యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి
పరారైయ్యారు. అక్కడ నుంచి ఎలాగో అలా బయట పడ్డ ఆ గర్భిణి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి
దర్యాప్తు చేస్తున్నారు. మరో దారుణమైన
విషయం ఏమిటంటే నిందితుల్లో ఇద్దరు మైనర్
యువకులు ఉన్నారని బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాదు తాము చేస్తున్నది గొప్ప పని
అయినట్లు అత్యాచార ఘటన్ని నిందితులు
వీడియో తీశారని బాధితురాలు ఆరోపించింది.