పరిటాల సునిత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రసాదరెడ్డి హత్య జరిగిన విషయం అందిరికీ తెలిసిందే. అయితే ఈ హత్య కుట్రలో పరిటాల సునిత ఆమె తనయుడు శ్రీరామ్ హస్తం ఉన్నట్లు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. అయితే ఈ విషయాన్ని ఆమె ఖండించారు. ప్రసాదరెడ్డి హత్య తర్వాత అక్కడి ఎస్.ఐని, సి.ఐని రిజర్వులోకి పంపడంపై ఆమె ఆగ్రహం చెందారు. దీంతో ఆమెకు కేటాయించిన గన్ మెన్లు తనకు అక్కర లేదని వారిని పంపించి తన అసంతృప్తిని తెలియజేసింది. దాంతో ఆ అధికారులను తిరిగి అక్కడే పోస్టింగ్ చేశారు. దీంతో పంతం నెగ్గించుకున్న పరిటాల సునిత తన భద్రత సిబ్బందితో క్యాబినెల్ కు హాజరయినట్లు సమాచారం.