తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేరు వార్తల్లో విపడటం లేదు. ఉద్యమ సయంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి  రోజూ ఏదో వార్తల్లో వినిపించేవారు. అయితే ఇప్పడు నారాయణ మరో సంచలన వ్యాఖ్య చేసి వార్తల్లో కి ఎక్కారు. తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రలు తనయులు ఇద్దరు అమెరికా మీద పడ్డారని వాళ్లు హైక్లాస్ బిచ్చగాళ్లు అని విరుచుకుపడ్డారు. కాగా మొన్న నారా లోకేష్, ఈ రోజు కేటీఆర్ అమెరికా పర్యటన చేస్తున్న విషయం అందరికీ తెలుసు.



పార్టీ కార్యకర్తలను ఉద్దశించి ప్రసంగిస్తున్న నారాయణ 


తెలంగాణలో కేసీఆర్ ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటూ దూకుడు పెంచారని అన్నారు. ఏపీలో రైతులకు ఇష్టం లేకుండా భూములు లాక్కుని రాజధాని నిర్మిస్తే అది శ్మశానంపై నిర్మించినట్లే అవుతుందని నారాయణ ధ్వజమెత్తారు. అంతే కాదు ఈ మధ్య అనంత పురం లో హత్యారాజకీయాలు ఎక్కువ అవుతున్నాయని వాటిని నిస్పక్షపాతంగా న్యాయ విచారణ జరిపించాలని చంద్రబాబుకు హెచ్చరిక చేశారు. అంతే కాదు ఆ మధ్య కలప స్మగ్లింగ్ చేస్తున్నారంటూ ఎన్ కౌంటర్ చేసిన వారందరూ నిజంగా స్మగ్లర్లు అని ఏడుకొండల వాడిపై ప్రమాణం చేసి బాబు చెప్పగలరా అని నారాయణ ప్రశ్నించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: