తెలంగాణలో టీడీపీ తరుపున చంద్రబాబు నాయుడికి నమ్మిన బంటు రేవంత్ రెడ్డి.  తెలంగాణలో ప్రతిపక్షహోదాలో ఉండి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ పై విరుచుకుపడుతుంటాడు. అంతే కాదు కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అని అందరూ అనుకుంటారు. అంతే కాదు ఈమధ్య కేసీఆర్ శిక్షణ తరగతులపై కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేశాడు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్టీ శిక్షణ కార్యక్రమానికి అసెంబ్లీ కార్యదర్శి, హైదరాబాద్ సీపీ వెళ్లడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు.  అలాంటిది ఇప్పుడు కేసీఆర్ ను కలవడానికి స్వయంగా రేవంత్ రెడ్డి వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇప్పటికే తెలంగాణలో టీడీపీ వర్గీయులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్న సమయంలో రెవంత్ రెడ్డి,కేసీఆర్ కలయిక ఏంటబ్బా అన్ని అనుకుంటున్నారు ఇరుపార్టీ వాళ్లు. 


పార్లమెంట్ లో కేసీఆర్, హరీష్ రావులపై ఫైర్ అవుతున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కార్యాలయానికి టిడిపి ఉప నేత రేవంత్ రెడ్డి వెళ్లారు.  పార్లమెంటరీ సెక్రటరీలకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లిన రేవంత్ , తీర్పు కాపీలను స్వయంగా సి.ఎమ్. ఆఫీస్ అధికారులకు అందచేశారు.పార్లమెంటరీ సెక్రటరీల జి.ఓ చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా పార్లమెంట్ సెక్రటరీలకు ఇస్తున్న అదనపు సౌకర్యాలను నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.మరి దీనిపై ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో! 



మరింత సమాచారం తెలుసుకోండి: