వారు ఇద్దరు పత్రికాధినేతలు, వేరు వేరు పార్టీలకు సపోర్టుగా రాస్తూ ఒకరంటే ఒకరు అగ్గిలం మీద గుగ్గిలం అవుతారు. అసలు ఉదయాన్నే లేవగానే ఈ ఇద్దరు పేపర్లలో, న్యూస్ చానల్లో ఇన్ డైరెక్టు గా లేదా డైరెక్ట్ గానో తిట్టుకోవడం పరిపాటే. మరి ఆ ఇద్దరు ఒకే దగ్గర కలిసి మాటా మంతి మాట్లాడుకుంటే ఎంత విడ్డూరంగా ఉంటుంది. అవును ఇది నిజం.. ఆ పత్రికా, చానెళ్ల అధిపతులు ఎవరో కాదు రామోజీరావు, వైఎస్ జగన్. ఉప్పు,నిప్పుగా ఉండే ఈ ఇద్దరు మాట్లాడుకున్నారన్న విషయం ఆసక్తికరంగానే ఉంది. రామోజీ, జగన్ లు మాట్లాడుకుంటుండగా, పక్కనే కాంగ్రెస్ ఎమ్.పి సుబ్బరామిరెడ్డి ఆసక్తిగా గమనిస్తున్నారు.


మంచు మనోజ్ ని ఆశీర్వదించిన రామోజీరావు


 ఫిలిం సిటీ ఎలా ఉందని రామోజీని జగన్ అడిగారట. అలాగే ఎండలో కూడా కష్టపడుతున్నావని జగన్ ను ఉద్దేశించి రామోజీరావు అన్నారట. జగన్ అనంతపురం జిల్లాలో రైతు భరోసాయాత్ర చేస్తున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రామోజీ అడిగారట. ఈ ఇద్దరు ఇంత మంచిగా మాట్లాడుకోవడం చూస్తు పక్కన ఉన్నవాళ్లు ముక్కుమీద వేలు వేసుకున్నారట. ఇంతకీ ఈ అపురూప సంఘటన ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా..? ఈ రోజు మంచు మోహన్ బాబు రెండవ తనయుడు మంచు మనోజ్ వివాహ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: