తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం శుక్రవారం ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ రోశయ్యను ఈరోజు ఉదయం కలసి పన్నీర్ సెల్వం తన రాజీనామా లేఖను అందజేశారు.  దీంతో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మళ్లీ సీఎం అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. చెన్నైలో జరిగిన శాసనసభా పక్ష సమావేశం అన్నాడీఎంకేకు చెందిన 144 మంది శాసనసభ్యులు పాల్గొన్నారు అలాగే శుక్రవారం ఉదయం అన్నాడీఎంకే శాసనసభా పక్ష సమావేశం జరిగింది.


జయలలితకు నమ్మిన బంటు పన్నీర్ సెల్వం

అన్నా డీఎంకే శాసనసభ పక్ష నాయకురాలిగా ఎన్నికైన జయలలిత శనివారం ప్రమాణం చేయనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రాజీనామా చేయగా, గవర్నర్ రోశయ్య ఆమోదించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా జయను ఆహ్వానించారు.


విజయ దరహాసంతో జయలలిత


జయలలితకు కేసీఆర్ శుభాకాక్షలు..

అన్నాడీఎంకే అధినేత జయలలితకు తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఆమె శుక్రవారం మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ శుక్రవారం ఉదయం ఫోన్‌లో జయను అభినందించారు.  


 ఎపీ కవితకు ప్రత్యేక ఆహ్వానం :

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా టీఆర్ఎస్ ఎంపీ కవితకు ఆహ్వానం పంపారు. కవిత రేపు ఉదయం చెన్నై వెళ్లనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జయలలితకు శుభాకాంక్షలు తెలియజేశారు.




మరింత సమాచారం తెలుసుకోండి: