అమ్మ మేలిమి బంగారంలా, కడిగిన ముత్యంలా అక్రమాస్తుల కేసు నుంచి బయట పడింది, అంతేనా తిరిగి ముఖ్యమంతి పీఠంపై ఎక్కబోతుంది. తమిళనాడులో సంబురాలు , జయలలిత మళ్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న క్రమంలో ఆమె అభిమానులు సంబురాల్లో మునిగి తేలుతున్నారుమొదలయ్యాయి.  అయితే ఇప్పటికే జయలలిత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బాంబు బెదిరింపులు వచ్చినట్లుగా మద్రాసు రైల్వే పోలీసులు శుక్రవారం నాడు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఫోన్ కాల్ ఎక్కడి నుండి వచ్చిందనే విషయమై విచారణ చేపట్టారు. అది ఓ మానసిక వికలాంగుడు చేసినట్లుగా తెలిసింది. ఉత్తుత్తి బెదిరింపు అని తెలిశాక పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.


జయలలిత సీఎం ప్రమాణ స్వీకారానికి సంబరాలు చేసుకుంటున్న ఆమె అభిమానులు


వేలాది మంది చెన్నైలో జయలలిత ఫోటోలతో ప్రదర్శన నిర్వహించారు. అమ్మ మళ్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం సంతోషంగా ఉందని ఆమె అభిమానులు తెలిపారు. ఇవాళ, రేపు తాము పండుగ చేసుకుంటామని చెప్పారు. చాలా సంతోషంగా ఉందన్నారు. 23న ఉదయం 11 గంటలకు జయలలిత తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 28 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: