స్వర్గీయ నందమూరి తారక రామారావు తనయ, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరికి ప్రమాదం చోటు చేసుకుంది.  సోమవారం ఉదయం ఇంట్లో వ్యాయామం చేస్తున్న సమయంలో భువనేశ్వరి ప్రమాదవశాత్తు కిందపడిపోయారు, ఈ ప్రమాదంలో ఆమె కుడి చేతి మణికట్టు  ఫ్రాక్చర్‌ అయ్యింది. అదృష్ట వశాత్తు ఆమె తనయుడు నారా లోకేష్ బాబు అక్కడే ఉండటంతో వెంటనే జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు.

సీఎం చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి కొడుకూ, కోడలు


ఈ నేపథ్యంలో అక్కడి ఎముకకు స్వల్ప చీలిక ఏర్పడిందని అపోలో వైద్య వర్గాలు వెల్లడించాయి,  అపోలో థర్డ్‌ ఫ్లోర్‌లోని ఇంటర్నేషనల్‌ వార్డులో వైద్యులు ఆమెకు చికిత్స అందజేస్తున్నారు.సీఎం  చంద్రబాబు నాయుడు,ఆయన   కోడలు బ్రాహ్మణి, బాలకృష్ణ సతీమణి వసుంధరలు ఆపోలో ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. మణికట్టు ప్రాక్చర్‌ కావడంతో స్వల్ప గాయమైందని వైద్యులు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: